Thursday, July 14, 2011

మురికివాడలో పుట్టిన వజ్రం

http://cdn8.wn.com/vp/i/18/8ff7cf18c1683e.jpg
పేదరికం ఆమెను చిన్నతనం నుంచి వేధించింది. కడు పు నింపుకునేందుకు ముంబై లోకల్‌ రైళ్ళలో క్లిప్పు లు, సూదులు అమ్ముకునేది. దుర్భరమైన ఆ జీవితం నుంచి సాక్షరత దిశగా ఆమె పయనం ఎన్నో మలుపులు తిరిగింది. అంటరాని వారిగా ముద్రపడిన తెగకు చెందిన ఆమె ఎన్నో సమస్యలను అధిగమించి తాను కోరుకున్న జీవితాన్ని అందుకున్నది. నేడు తనతోటి పిల్లలకు చదువు చెప్పడమే కాదు కంప్యూటర్‌ కోచింగ్‌ కూడా ఇస్తున్నది. ఆమే దుర్గ మల్లిగుడులు. ప్రపంచ సామాజిక సదస్సుకు భారత ప్రతినిధిగా ఆమె బ్రెజిల్‌ వెళ్ళి వచ్చింది.

tribal-girl 
పిన్నీసులు, సూదు లు అమ్ముకునే స్థితి నుంచి ఈ స్థాయికి రావడానికి 22 ఏళ్ళ ఈ యువతి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. వాటన్నింటినీ పట్టుదలతో అధిగమించింది. ముంబైలోని జోగేశ్వరిలో ఉన్న సంజయ్‌ నగర్‌ మురికివాడలలో పది అడుగు లు కూడా ఒక లేని చిన్న గదిలో నివసిస్తుంది. ఆ చిన్న గదే వారి ఇంద్రభవనం. దుర్గ, ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు గోవిం ది ఆ గదిలో ఉంటారు. వారు సంచార జాతికి చెందిన వైదు తెగకు చెందిన వారు. అయితే మూడు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నారు. ప్రస్తుతం డీ నోటిఫై అయిన ఈ తెగ ఇంకా పంచాయితీలను నిర్వహిస్తుంది. శాంతి భద్రతలను కాపాడేం దుకు ఆ తెగకు చెందిన పెద్దలు పంచాయితీలు నిర్వహిస్తారు.

విస్తారంగా ఉండే ఆ మురికివాడలో వైదులను దూరంగా నెట్టివేశారు. వారికి అత్యంత సమీపంగా ఉన్న టాయిలెట్‌ 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకి సమీపంలో ఉన్న పంపు నుంచి వచ్చే మురికినీరు పట్టుకోవడానికే ఆడపిల్లలు ప్రతి రోజూ తెల్లవారుజామున ఐదుగంటలకే పొడవాటి క్యూలలో నిలబడతారు. అందుకే ఆ తెగలో ఎక్కువ మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారని అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్స్‌ నీలిమ అక్కడి పరిస్థితులను వివరించింది. ఆ తెగకు చెందిన పురుషులు జీవనం గడపడానికి పాత స్టీల్‌ డబ్బాలకు మరమ్మత్తు చేయడం, రీసైక్లింగ్‌ చేయడం చేస్తారు. దానితో వచ్చే వారి సంపాదనలో సగానికి పైగా తాగుడుకే ఉపయోగిస్తారు.

తాగిన తర్వాత భార్యను చితకబాదడం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయం అని దుర్గ తల్లి 63 ఏళ్ళు అంకూ బాయ్‌ చెప్పింది. రోజూ రెండు పూటలా కడుపు నింపుకునేం దుకే ఆ కుటుంబం పోరాటం చేయవలసి వచ్చేది. తాను చిన్నతనంలో ఏనాడూ ఇంట్లో వండిన వంటను చూడలేదని, ఎందుకంటే తాము తిండి కోసం రైళ్ళలోనూ, ఇళ్ళల్లోనూ అడుక్కునే వారమని దుర్గ గుర్తు చేసుకుంది.అయితే ఆ తెగలో చదువుకున్న తొలి యువతి దుర్గ అయిన తర్వాత పరిస్థితులు నాటకీయంగా మారనారంభించాయి.

ఆమె నేడు 12వ తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రాథమిక కంప్యూటర్‌ శిక్షణను ఇస్తోంది. అంతేకాదు, 40 మంది స్కూల్‌ పిల్లలకు కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. అదంతా కన్నంలాంటి ఆమె ఇంటి నుంచే. అంతేకాదు, సామాజిక సదస్సులో తాను కలుసుకున్న పెరూ, అమెరికాకు చెందిన కొందరు స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు కూడా ఆమె కంప్యూటర్‌ను వినియోగిస్తుంది. తనను సమీపంలో ఉన్న మునిసిపల్‌ పాఠశాలలో చేర్పించమని తన తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థ యువకు చెందిన కార్యకర్తలు ఎంతగా నచ్చ చెప్పవలసి వచ్చిందో దుర్గ గుర్తు చేసుకుంటుంది.

పాఠశాలలో చేరిన కొత్తల్లో ఆమెను, ఆమె సోదరిని విడిగా కూర్చుపెట్టేవారుట. ఎందుకంటే వారు మురికోడుతూ, కంపు కొడుతూ ఉండేవారమని దుర్గే చెబుతుంది. అయితే చదువులోను, ఆటల్లోనూ చురుకుగా ఉండడంతో వారికి సహ విద్యార్ధులు స్నేహ హస్తం అందించారుట. ఇదొక్కటే కాదు అక్షరాస్యత కలగడం వల్ల అనేక లాభాలు కలిగాయి వారికి. తన కుమార్తెలిద్దరూ పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాక తాము అడుక్కోవడం మానేసి గౌరవప్రదంగా జీవించడం ప్రారంభించామని, దుర్గ తండ్రి తాగుడు కూడా మానేశాడని తల్లి అకూబాయ్‌ చెప్పింది.

దుర్గ నేడు ఆత్మవిశ్వాసం గల యువతి. నిరాధారంగా మొదలైన ఆమె ప్రయాణం ఈ స్థితికి చేరుకోవడం అంటే సాధారణమైన విజయం కాదు అని యువ సంస్థ కార్యకర్త రాజు భీసే అభిప్రాయపడ్డారు. తాము ఆమెకు మద్దతు, మార్గదర్శనం ఇచ్చామని కానీ ఆమె తనలో ఉన్న నాయకత్వ పటిమతో తన కాళ్ళపై తాను నిలబడిందని ఆయన అంటారు. దుర్గ సోదరి గోవింది ప్రస్తుతం జిఎన్‌ఐఐటి నుంచి సాఫ్ట్‌వేర్‌ కోర్స్‌ చేస్తున్నది. గోవింది తన కోర్స్‌ పూర్తి చేసిన తర్వాతే తన గ్రాడ్యుయేషన్‌ చేయాలని దుర్గ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇంటి బాధ్యత ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకోవాలి.

ముక్కుసూటిగా మాట్లాడడం దుర్గకు అలవాటు. బాలకార్మికతను గురించి చైతన్యం తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రకటించింది. కానీ అటువంటి పిల్లల తల్లిదండ్రులకు సరైన జీవనోపాధి కలిగించనంత వరకూ ఆ లక్ష్యం నెరవేరదని దుర్గ అభిప్రాయం. వీధి నాటకాలు వేయడం, పోస్టర్ల ద్వారా ప్రచారం, ఇంటింటికి వెళ్ళి బాలకార్మితకు వ్యతిరేకంగా మాట్లాడి జనాన్ని నచ్చచెప్పడం వంటివన్నీ కూడా నిరుపయోగమేనన్నది ఆమె భావన.

సామాజిక సదస్సుకు వెళ్ళి వచ్చిన తర్వాత దుర్గ వీధి బాలలు, మురికివాడలకు చెందిన పిల్లలతో కలిపి ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసింది. అదే బాల అధికార్‌ సంఘర్ష్‌ సంఘటన్‌ (హక్కుల కోసం బాలల పోరాటం). ఆమెను బాలల మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ముంబైకి చైర్మన్‌గా 500 మంది పిల్లలు కలిసి ఎన్నుకున్నారు. సామాజిక సదస్సుకు భారత్‌ నుంచి దుర్గతో పాటు కాళి సమల్‌ అనే బాలిక కూడా పాల్గొన్నది. ఆమె తండ్రి రిక్షా తొక్కేవాడు. కానీ అనారోగ్యం వల్ల రోజు కూలీగా మారాడు. కాళి కూడా కటక్‌లో ఒక ఇటుకలో బట్టీలో పని చేసేది. ఆ ప్రాంతంలోని సుప్రతీవ సంస్థ ఆమె పాఠశాలకు వెళ్ళేందుకు సాయపడింది. ప్రస్తుతం ఆమె పిల్లల హక్కుల గురించి ప్రచారం సాగిస్తోంది.

వీరితో పాటు సదస్సులో పాల్గొన్న మరొక యువతి సోనాల్‌ దనభాయి బరియా అనే 16 ఏళ్ళ గుజరాతీ యువతి. ఆమె తండ్రి డైమండ్‌ కట్టర్‌. ఆమె తండ్రి నెలకు 2,500 రూపాయలు సంపాదించేవాడు.ఏడుగురు కుటుంబ సభ్యులకు అదే ఆధారం. తండ్రికి కిడ్నీ ఆపరేషన్‌ జరగడంతో సోనాల్‌ స్కూల్‌ మానేసి నెలకు 550 రూపాయలు ఇచ్చే పనిలో కుదురుకుంది. ఈ యువతులందరి ఆర్థిక నేపథ్యం ఒక్కటే. అయితే ఏం వీరంతా నేడు కుటుంబము, సమాజమూ కూడా గర్వపడే స్థాయికి ఎదిగారు. జీవించడం నేర్చుకున్నారు.

No comments: