ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాల గురించి తరచూ మీడియాలో రకరకాల వార్తలు వస్తుంటారుు. మన దేశానికి చెందిన రాజకుటుంబాల వివరాలు, విశేషాలు బయటకు రావడం తక్కువే. నిజానికి రాజ రికానికి పెట్టింది పేరు భారతదేశం. స్వాతంత్య్రం వచ్చే వరకూ దేశంలో వందలాది సంస్థానాలు, కొన్ని పెద్ద రాజ్యాలు బ్రిటిష్ రాణి పాలనను అంగీకరిస్తూనే తమ స్వతంత్రప్రతిపత్తిని నిలబెట్టుకున్నారుు. ఆనాటి రాజ్యాలు పోరుునా, ఆ రాజవంశీకుల జ్ఞాపకాలు మాత్రం నేటికీ ప్రజల మనస్సుల్లో మిగిలిపోయారుు. ఆ నాటి రాజకుటుంబీకుల వారసుల ప్రస్తుత జీవితపు తీరుతెన్నులపై ప్రజానీకంలో ఆసక్తి అలా కొనసాగు తూనే ఉంది. రాజకుటుంబాల వారసులుగా ఉన్న వారిలో పలువురు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నా రు. వీరిలో కొందరు రాజకీయాల్లోనూ ఉన్నారు. వీరంతా కూడా ‘రాజు’ హోదా దక్కని ‘యువరాజు’లే! బ్రిటన్ విలియవ్గ్సు, హ్యారీల గురించి కాసేపు మర్చిపోదాం. మన యువరాజుల గురించి తెలుసుకుందాం!
పటౌడీ పట్టాభిషేకం

రాజ్యాలు పోయినా రాజ్యాభిషేకాలు మాత్రం ఆగడం లేదు. ఏ విధమైన అధికారిక గుర్తింపు లేకపోయినప్పటికీ, యువ రాజులను పట్టాభిషిక్తులను చేయడం నేటికీ కొన్ని రాజవంశాల్లో ఆనవాయితీగా వస్తోంది. పటౌడీ రాజకుటుంబాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను ఇటీవలే పటౌడీ (హర్యానా) నవాబుగా పట్టాభిషిక్తుడిని చేశారు. తల్లి షర్మిలా ఠాగూర్ స్వయంగా పట్టం కట్టారు. పటౌడి లోని పురాతన రాజభవనంలో జరిగిన ఈ వేడుకకు చుట్టుపక్కల వందలాది గ్రామాల ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు.
ప్రొఫైల్..
పేరు : సైఫ్ అలీ ఖాన్
పుట్టిన తేదీ : 16 ఆగస్టు 1970
తల్లిదండ్రులు: మన్సూర్ అలీ ఖాన్,
షర్మిలా ఠాకూర్
వృత్తి : సినీ నటుడు, నిర్మాత
సహచరి : అమృత సింగ్ (ప్రస్తుతం) కరీనా
పిల్లలు : ఇద్దరుఉదయ్పూర్ యువరాజు

రాజకుటుంబానికి ఆస్తుల పర్యవేక్షణ చూడడంతో పాటుగా వివిధ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంటారు. క్రికెట్ అంటే ఆసక్తి. ఉదయ్పూర్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు చూస్తుంటారు. ఇటీవలే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
ప్రొఫైల్..
పేరు : లక్ష్యరాజ్సింగ్ మేవార్
వయస్సు : 26
రాజ్యం : మేవార్
తల్లిదండ్రులు: అరవింద్ సింగ్, విజయ్రాజ్ కుమారి
అభిరుచి : ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, చిత్రలేఖనం
విశేషం : మహారాణా ప్రతాప్సింగ్
వంశానికి చెందిన వ్యక్తి పత్రిక ఎడిటర్గా త్రిపుర రాకుమారుడు

మాణిక్య వంశానికి చెందిన ఈ రాకుమారు డు ‘ది నార్త్ఈస్ట్ టుడే’ అని పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. త్రిపురలో ఈ పత్రిక బాగా ఖ్యాతి చెందింది కావడం విశేషం. వివిధ సామాజిక కార్యకలాపా ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రొఫైల్..
పేరు : కిరీట్ ప్రద్యోత్ దేవ్ బర్మన్
వయస్సు : 33
రాజ్యం : త్రిపుర
పుట్టిన తేది : 4 జులై 1978నిరాండంబర రాజకుమారుడు

వారసత్వ పోరు కొనసాగిస్తున్న ఈ రాజకుమారు డు నిరాడంబరంగా జీవించడాన్నే ఇష్టపడడం విశేషం.
ప్రొఫైల్..
పేరు : దేవ్రాజ్ సింగ్
వయస్సు : 30
రాజ్యం : జైపూర్ (ఇసార్దా)
పుట్టిన తేది : 4 జులై 1978
విశేషం : మహారాణి గాయత్రీదేవి
వారసుల్లో ఒకరురాజకీయాల్లో రాణింపు

డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసు కున్న సింధియా 1993లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బి.ఎ (ఎకనామిక్స్) చదివారు. 2001లో అమెరికాలో ఎంబీఏ చేశారు. 2002 ఫిబ్రవరిలో తొలిసారిగా లోక్సభకు ఎన్నిక య్యారు. 2009లో కేంద్రంలో మంత్రి పదవి స్వీకరించారు. భార్య ఒక హోటల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ప్రొఫైల్..
పేరు : జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా
వయస్సు : 40
రాజ్యం : గ్వాలియర్
తల్లిదండ్రులు: మాధవరావు, మాధవి రాజె
పుట్టిన తేది : 1 జనవరి 1971
పార్టీ : కాంగ్రెస్
భార్య : ప్రియదర్శిని రాజె సింధియా
హోదా : వాణిజ్యం,
పరిశ్రమల శాఖ సహాయ మంత్రిమోడలింగ్లో రాణింపు

ఆర్కేష్ తాత మహరాజా రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ ఒరిస్సాకు తొలి ముఖ్యమంత్రి. ఈ రాకుమారుడు మాత్రం రాజకీయాల కన్నా మిన్నగా మోడలింగ్పై ఆసక్తి కనబరుస్తున్నాడు. న్యూయార్క్లో నటనలో, ముంబయిలో థియేటర్ ఆర్ట్సలో శిక్షణ పొందాడు.
ప్రొఫైల్..
పేరు : ఆర్కేష్ సింగ్ దేవ్
వయస్సు : 25
రాజ్యం : బోలన్గిర్ (ఒడిషా)రఘోఘడ్ రాజ్పుత్

తండ్రి అడుగుజాడల్లో జయవర్ధన్ సింగ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. సింధియాలకు మంచి పట్టు ఉన్న గుణ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో జ్యోతిరాదిత్య సింధియాకు ప్రత్యర్థిగా జయవర్ధన్ సింగ్ను అభివర్ణిస్తుంటారు.
ప్రొఫైల్..
పేరు : జయవర్ధన్ సింగ్
వయస్సు : 27
రాజ్యం : రఘోఘడ్
అంగారకుడి గుట్టువిప్పే రోబో!
తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు
లిక్కర్కింగ విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా(23). విజయ్ మాల్యా తన తనయుడు సిద్దార్థకు 18 సంవత్సరాల వయసులోనే కంపెనీలో బాధ్యతలను అప్పగించారు. సిద్దార్థకు ముందుగా తమ యుబి గ్రూప్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఓ ఉన్నతస్థానాన్ని అప్పగించారు. అప్పటి నుంచే కంపెనీ పదవీ,బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తండ్రిచేత ప్రశంసలనందుకుంటున్నాడు సిద్దార్థ. కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలను అనుకున్న స్థాయిలో నిర్వహిస్తూ తమ లిక్కర్ బ్రాండ్ను అందరికీ దగ్గరికి చేర్చడంలో సిద్దార్థ కృతకృత్యుడవుతున్నాడు. ఇక సిద్దార్థ నాయకత్వలో యుబి గ్రూప్ ప్రముఖ బ్రాండ్ వైట్ అండ్ మెకేను 2007లో చేజిక్కించుకోవడంలో సఫలీకృతమైంది. 2010లో సిద్దార్థ యునైటెడ్ స్పిరిట్స్లో సేల్స్ ఔట్లెట్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా బాధ్యతలను చేపట్టాడు.
ప్రముఖ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ వారసునిగా ఆయన పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్జీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన ప్రస్తుతం కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్గా పదవీ,బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు ఆయన కంపెనీ ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా పనిచేశాడు. రాబోయే రోజుల్లో కంపెనీ చైర్మన్ కానున్న ఆయన ఇప్పటికే ఎంతో సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. దీంతో తండ్రి అజీమ్ ప్రేమ్జీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక రిషద్ విప్రోలో 2007 జూలైలో చేరాడు. ముందుగా ఆయన కంపెనీ బ్యాంకింగ్, ఫైనాన్స్ డివిజన్ బిజినెస్ మేనేజర్గా చేశాడు. 2009లో ఇన్వెస్టర్ రిలేషన్స్ జనరల్ మేనేజర్గా చేయగా 2010లో ఛీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్గా పదవీబాధ్యతలు స్వీకరించాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ పూర్తి చేసిన రిషద్ వెస్లీ యూనివర్సిటీలో బిఎ (ఎకనామిక్స్)పూర్తిచేశాడు.
టివిఎస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ కూతురే లక్ష్మి వేణు(27). ఆమె వివాహం ఇటీవలే ఇన్పోసిస్ ప్రముఖుడు రోహన్ మూర్తితో జరిగింది. ఆమె టివిఎస్ మోటార్స్కు చెందిన సుందరమ్ క్లేటన్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్గా పదవీ,బాధ్యతలను నిర్వహిస్తోంది. వార్విక్ యూనివర్సిటీ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్లో పిెహచ్డి, ఏల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పిజిని ఆమెపూర్తి చేసింది. ‘లక్ష్మి మా వ్యాపార కార్యకలాపాల్లో ఎంతో సహకరిస్తోంది. ఆమె ప్రొఫెషనల్గా నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను లాభాల బాటల పయనింపచేస్తోంది. కొత్త ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఆమె వినూత్న శైలి ని అనుసరిస్తోంది’ అని వేణు అన్నారు.
ఎయిర్దక్కన్ వ్యవస్థాపకుల లో ఒకరైన జి.ఆర్.గోపి నాథ్ కుమార్తె పల్లవి గోపినాథ్. దేశంలోని తక్కువ టిక్కెట్ ఛార్జీలను వసూలు చేసిన వైమానిక సంస్థగా ఎయిర్ దక్కన్ పేరు గాంచింది. ఇక మీడియా, లిటరేచర్, ఏరోస్పేస్లలో మాస్టర్ డిగ్రీలను సంపాదించిన పల్లవి గోపినాథ్ 2008లో దక్కన్ 360లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరింది.
భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ కుమారుడు శ్రవీణ్ మిట్టల్(23) తమ కంపెనీలో కొత్తగా చేరాడు. ఆయన భారతి ఎయిర్టెల్ ఇంటర్నేషనల్-నెదర్లాండ్స్(బిఎఐఎన్) మేనేజర్గా పదవీ, బాధ్య తలు స్వీకరించాడు. కొత్త బాధ్యతలను నిర్వహణలో ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. పట్టుదల, నిరంతర కృషితో అనుకు న్న లక్ష్యాలను సాధించేందుకు ఆయన పనిచేస్తున్నాడు. ‘పలు ప్రముఖ కంపెనీల అధినేతలు తమ కుమారులను నేరుగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టకుండా వారిని కింది నుంచి పైకి వివిధ స్థానాల్లో పదవీ,బాధ్యతలు నిర్వర్తిం చే విధంగా చూస్తున్నారు. దీంతో చివరికి కంపెనీ అధి నేతగా చేరుకున్న తర్వాత సంస్థను పూర్తిగా అభివృద్దిపరుస్తూ లాభాల బాటలో పయ నింపచేసేందుకు అనుకున్న అనుభవం వారికి కలుగుతుంది’ అని సెంటర్ ఆఫ్ సోషల్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ (సిఎస్ఒఎల్)కు చెందిన విజయ్కుమార్ తెలిపారు.
హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ కుమార్తె రోష్ని నాడర్ 2009లో తమ కంపెనీలో చేరింది. ఆమె హెచ్సిఎల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా 27 సంవత్సరాల వయసులో చేరింది. అంతకుముందు ఆమె శివ్ నాడర్ ఫౌడేషన్కు అధినేతగా వ్యవహరిం చింది. ఇక రోష్ని గతంలో టెలివిజన్ ప్రొడ్యూసర్గా సైతం చేసిం ది. నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి సోషల్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కోర్సును రోష్ని పూర్తిచేసింది.